పుట్టపర్తిలో టీడీపీ వర్సెస్ వైసీపీ.. నెలకొన్న ఉద్రిక్తత

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.టీడీపీ, వైసీపీ నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది.

పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు రావాలంటూ వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, టీడీపీ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిలు పరస్పరం సవాళ్లు చేసుకున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో సత్యమ్మ ఆలయం వద్ద ఇరువురు చర్చకు సిద్ధం అయ్యారు.

TDP Vs YCP In Puttaparthi.. There Is Tension-పుట్టపర్తిల�

ఈ క్రమంలోనే రెండు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు పరస్పరం కర్రలు, చెప్పులతో దాడికి పాల్పడ్డారు.దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

పోలీసుల సమక్షంలోనే దాడులకు పాల్పడ్డారు.ఈ సందర్భంగా నెలకొన్న తోపులాటలో మాజీ మంత్రి పల్లె సొమ్మసిల్లి పడిపోయారని తెలుస్తోంది.

Advertisement

అంతేకాకుండా ఇరు వర్గాల ఘర్షణలో వాహనం కూడా ధ్వంసమైందని సమాచారం.

పురుషుల్లో అధిక హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టే ఎఫెక్టివ్ రెమెడీ ఇదే!
Advertisement

తాజా వార్తలు