కుప్పంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో ప‌ర్య‌టించ‌బోతున్నారు.మూడు రోజుల‌పాటు కుప్పంలో మ‌కాం వేయ‌నున్నారు.

ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా క్ల‌స్ట‌ర్, యూనిట్ క్ల‌స్ట‌ర్, బూత్ ఇంఛార్జీల‌తో భేటీ కానున్నారు.అనంత‌రం వారి ప‌నితీరు, పార్టీ స‌భ్య‌త్వ న‌మోదును కూడా స‌మీక్షించ‌నున్నారు.

ఈ క్ర‌మంలో ఓట‌ర్ల జాబితాపై పార్టీ శ్రేణుల‌ను చంద్ర‌బాబు అప్ర‌మ‌త్తం చేయ‌బోతున్నారు.అదేవిధంగా ప‌లు సూచ‌న‌లు చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

కుప్పం ప‌రిధిలో మొత్తం 11 క్ల‌స్ట‌ర్లు ఉండ‌గా.ప్ర‌తి క్ల‌స్ట‌ర్ కు 45 నిమిషాల స‌మ‌యాన్ని చంద్ర‌బాబు కేటాయించ‌నున్న‌ట్లు స‌మాచారం.

Advertisement
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 5, ఆదివారం 2023