ఇవాళ వీడనున్న కర్ణాటక సీఎం సస్పెన్స్..!

కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న విషయంపై నెలకొన్న ఉత్కంఠకు నేటితో తెరపడనుంది.అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇప్పటికే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

డీకే శివకుమార్, సిద్ధరామయ్యలలో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపనుందోనన్న దానిపై కర్ణాటకతో పాటు యావత్ దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.ఈ క్రమంలోనే సీఎం అభ్యర్థిపై మరి కొన్ని గంటలలో ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ప్రకటన చేయనున్నారు.

అయితే సిద్ధరామయ్యనే పార్టీ అధిష్టానం ఖరారు చేసిదని, ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ కు నచ్చజెప్పేందుకే ఢిల్లీ పిలిచారని ప్రచారం జోరుగా కొనసాగుతోంది.మరోవైపు ఈ వాదనలను శివకుమార్ వర్గీయులు తోసిపుచ్చుతున్నారు.

పోలీసులకు ఫిర్యాదు వల్ల రాజ్ తరుణ్ కెరీర్ కు ఇబ్బందేనా.. కొత్త ఆఫర్లు సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు