ఆడవారికి ప్రత్యేక వైన్స్‌... చేయండి రా దేశాన్ని నాశనం చేయండి

ఒకప్పుడు పలు విషయాల్లో ఇండియా విదేశాలకు ఆదర్శనీయంగా ఉండేది.

కాని ఇప్పుడు మన దేశం ప్రతి విషయాన్ని కూడా ఇతర దేశాలను ఆదర్శంగా తీసుకుని మన ఆదర్శపు పద్దతులను కూడా నాశనం చేస్తున్నారు.

ఒకప్పుడు ఇండియన్‌ మహిళలు దేవతలుగా పూజింపబడేవారు.కాని మారుతున్న పరిస్థితులు చూస్తుంటే బాధ వేస్తుంది.

కొందరు స్త్రీలు మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారు.వారికి సై అన్నట్లుగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి.

మహిళలు మద్యం తాగడం పాశ్చత్య పద్దతి.కాని ఇండియన్స్‌ కూడా ఈమద్య కాలంలో మద్యంకు అలవాటు పడ్డారు.

Advertisement

మహిళలు పెద్ద ఎత్తున మద్యం తాగుతున్నట్లుగా ఇండియాలో ఒక సర్వే సంస్థ నిర్థారించింది.ముఖ్యంగా ముంబయి, ఢిల్లీ, హైదరాబాద్‌, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో మహిళలు మద్యంలో ఈత కొడుతున్నారట.

ఆడవారు మద్యం ఎక్కువ తాగుతున్నారు, వారు మద్యంను కొనుగోలు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు అంటూ కొందరు మహిళలకు ప్రత్యేక వైన్‌ షాప్‌లు తెరవాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.మహిళల వైన్స్‌ను మెట్రో నగరాల్లో ప్రారంభించడం వల్ల వారికి పూర్తి భద్రత మరియు వారి గౌరవం కాపాడిన వారు అవుతారు అంటూ కొందరు ప్రత్యేక వైన్స్‌ కోసం డిమాండ్‌ చేస్తున్నారు.

ఇప్పటికే దేశంను సంకనాకించారు, ఇక ప్రత్యేక వైన్స్‌ అంటూ ఏర్పాటు చేసి మరింతగా నాశనం చేయండి.మహిళలు మందు తాగడమే ఎక్కువ అంటే వారికి ప్రత్యేకంగా వైన్‌ షాప్‌లు ఏర్పాటు చేయడం ఏంటీ అంటూ కొందరు నెటిజన్స్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.ఢిల్లీ వంటి నగరంల మహిళలకు ప్రత్యేక వైన్‌ షాప్‌లు కావాలి అంటూ చాలా ఏళ్లుగా డిమాండ్‌ ఉంది.

ఎందుకంటే విదేశీయులు మద్యం కొనుగోలు చేసేందుకు ఇబ్బంది పడుతూ ఉన్నారు.

Betway: Practical Guide To Player Safety And Responsible Gambling

విదేశీ మహిళల గౌరవంను కాపాడేందుకు వైన్స్‌ షాప్‌లు ఆడవారికి ప్రత్యేకంగా ఓపెన్‌ చేయాలని కొందరు అన్నారు.కాని ఇప్పుడు ఇండియన్‌ ఆడవారు తాగేందుకు ఇబ్బందు పడుతున్నారు, వారు షాప్‌కు మగవారితో కలిసి వెళ్లాలి అంటే భయపడుతున్నారు అందుకే వారికి ప్రత్యేక వైన్స్‌ కావాలని డిమాండ్‌ చేయడం చూస్తుంటే ఈ దేశంలో మరెన్ని దారుణాలు జరుగుతాయో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

Advertisement