ముద్రగడ కు 'ఉప్మా' సొమ్ములు చెల్లిస్తున్న జనసైనికులు

ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ను ఉద్దేశించి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం సంచలన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ విమర్శలకు జనసేన నాయకుల నుంచి గట్టిగానే ముద్రగడకు కౌంటర్లు వచ్చాయి.

పవన్ ను ఉద్దేశించి ముద్రగడ రాసిన లేఖలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంశాన్ని ప్రస్తావించడం, ఆయనను పవన్ తిట్టడం పై ముద్రగడ( mudragada ) అభ్యంతరం వ్యక్తం చేయడం వంటి వ్యవహారాలపై తాజాగా జనసేన నాయకులు ముద్రగడకు వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు.ఈ మేరకు జనసేన కార్యకర్తలు , పవన్ అభిమానులు ముద్రగడకు 1000 రూపాయలు చొప్పున మనీయర్దర్ పంపుతున్నారు.

దీనికోసం భారీ సంఖ్యలో యువకులు పోస్ట్ ఆఫీస్ ల వద్ద క్యూ కట్టారు.గతంలో కాపు ఉద్యమం సమయంలో ముద్రగడతో కలిసి పోరాటం చేసిన సమయంలో, తెలియక ఆయనతో ఉప్మా తిన్నామని జనసేన నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

ఆ ఉప్మా పంపిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి డబ్బులు తిరిగి పంపాలంటూ ముద్రగడ పద్మనాభంకు భారీ సంఖ్యలో జనసేన నాయకులు మనీ ఆర్డర్లు పంపుతున్నారు.

Advertisement

ఉద్యమాన్ని ద్వారంపూడి( Dwarampudi ) కి తాకట్టు పెట్టిన ముద్రగడ తిరిగి డబ్బులు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. మీరు తిన్న ఉప్మా కు డబ్బులు పంపుతున్నాం అంటూ ముద్రగడను ఉద్దేశించి జనసేన పిఎసి సభ్యుడు పంతం నానాజీ సెటైర్లు వేశారు.ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ వైసిపి ఎమ్మెల్యేలను, కీలక నాయకులను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పై విమర్శలు చేయగా, ఆయన తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.ఇదే అంశంపై ముద్రగడ పద్మనాభం కూడా స్పందిస్తూ పవన్ వ్యాఖ్యలను తప్పుపట్టారు.

కాపు ఉద్యమంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ( Chandrasekhar Reddy )ఎంతగానో సహకరించారని, ఆయనపై ఈ విధంగా విమర్శలు చేయడం పవన్ కు తగదు అంటూ సూచించారు.అంతేకాకుండా పవన్ రౌడీ భాష మాట్లాడుతున్నారని ముద్రగడ లేఖలో విమర్శించడంపై ముద్రగడను టార్గెట్ చేసుకుని జన సైనికులు విమర్శలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఇప్పుడు ముద్రగడకు మనియార్డర్ పంపుతూ ఉప్మా సొమ్ములు చెల్లించాలంటూ తమదైన శైలిలో నిరసన తెలుపుతున్నారు.

ఏకంగా హీరోనే డామినేట్ చేసిన టాలెంటెడ్ యాక్టర్స్.. ఎవరంటే..? 
Advertisement

తాజా వార్తలు