Kali Bari Temple Shimla : కాళీమాత అత్యంత రహస్యమైన దేవాలయం.. ఎక్కడో తెలుసా..?

ఆగ్రా లోని కలి బారి( Kalibari )లో 200 ఏళ్లకు పైగా పురాతనమైన చారిత్రాత్మకమైన కాళీ మాత దేవాలయం( Kalimata Mandir ) ఉంది.

బెంగాలీలు స్థాపించిన ఏకైక దేవాలయం ఇదే అని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు.

ఈ మర్మమైన దేవాలయం అనేక అద్భుత సంఘటనలతో ముడిపడి ఉన్నాయి.ఈ దేవాలయ స్థాపన సమయంలో ఒక ఘాట్ దొరికిందని, ఈ ఘాట్ ఇప్పటికీ నీటితో నిండి ఉందని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు.

దీని ప్రత్యేకత ఏమిటంటే ఘాట్లోనీ నీరు ఎప్పుడూ తగ్గలేదని అందులో ఎలాంటి క్రిములు ఉండవని ఇక్కడి పండితులు చెబుతున్నారు.కలిబరి రహస్యమైన కాళీ దేవాలయం 200 సంవత్సరాలకు పైగా పురాతనమైనది.

అలాగే ఈ దేవాలయంలో అద్భుతాలు ఎన్నో జరిగాయి.అందుకే ఈ దేవాలయం నేటికీ రహస్యంగానే ఉంది.

Advertisement

బెంగాల్లో ప్లేగు( Plague ) అనే భయంకరమైన వ్యాధి వచ్చిన తర్వాత భట్టాచార్య పూర్వికులు ఆగ్రకు వచ్చి యమునా నది( Yamuna River ) ఒడ్డున నివసించారు.అప్పుడూ కాళీమాత కలలో కనిపించి, ద్వారకానాథ్‌కి తాను యమునా నది ఒడ్డున ఉన్నానని గ్రహించి, ఆ దేవాలయంలో ఇప్పటికీ ఉన్న అమ్మవారి విగ్రహాన్ని, ఘాట్‌ని తన వెంట తెచ్చుకున్నాడు.ముఖ్యంగా చెప్పాలంటే డా.దేవాశిష్ భట్టాచార్య పూర్వీకులు యమునా నది ఒడ్డున అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు.

ఆలయం ప్రత్యేకత( Kali Bari Temple Significance ) ఏమిటంటే దాంట్లోనే నీరు ఎప్పుడు తగ్గదు.నీరు ఎప్పుడూ ఎండిపోదు.ఈ రోజు వరకు ఆ నీటిలో ఎటువంటి జీవి లేదు.

ఈ దేవాలయనికి భక్తులలో ఎంతో ఆదరణ ఉంది.మాతా రాణి దేవాలయానికి ఎంతో మంది తల వంచి కోరికలు తీర్చుకునేందుకు వస్తూ ఉంటారు.

ప్రతి రోజు భక్తుల కోరికలను తీరుస్తూ ఉంటుంది.ఈ దేవాలయంలో పూర్వకాలం మేకలను బలి ఇచ్చేవారు.

అల్లంతో అధిక హెయిర్ ఫాల్ పరార్.. ఎలా వాడాలంటే?
అదృష్టాన్ని తెచ్చే దేవుడు ముందు దీపం వెలిగించడానికి.. ఈ నియమాలు పాటించండి..!

కానీ ప్రజల అభ్యంతరాలు దృష్టిలో ఉంచుకొని ఈ బలిని నిలిపివేస్తున్నట్లు పండితులు చెబుతున్నారు.ఈ రహస్యమైన దేవాలయానికి ప్రతి ఏడాది ఎంతో మంది భక్తులు దర్శనం కోసం వస్తూ ఉంటారు.

Advertisement

తాజా వార్తలు