శేఖర్ కమ్ముల డైరెక్టన్ లో అక్కినేని స్టార్ నాగ చైతన్య

ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.ఆయన చిత్రాలు వాస్తవానికి దగ్గరగా ఎంతో భిన్నంగా ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తూ ఉంటారు.

అయితే ఇప్పుడు ఇటీవల మజిలీ తో మంచి హిట్ కొట్టిన అక్కినేని స్టార్ నాగ చైతన్య తో కలిసి ఒక ప్రాజెక్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది.ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేయడం తో ఇప్పుడు ఈ వార్త కన్ఫర్మ్ అయిపొయింది.

అయితే ఈ చిత్రంలో నాగ చైత్యన కు జోడీ గా మ‌ల‌యాళ బ్యూటీ సాయి ప‌ల్ల‌వి నటించనుంది.ఇప్పుడే అధికారిక ప్రకటన విడుదల అయిన ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఆగ‌స్ట్ మొద‌టి వారం నుండి జ‌ర‌గ‌నుంద‌ని అంటున్నారు.

ఫిదా చిత్రం తరువాత శేఖర్ తన నెక్స్ట్ చిత్రం కోసం చాలా గ్యాప్ తీసుకొని చైతు తో ఈ చిత్రం చేస్తున్నారు.స‌వ్య‌సాచి, శైల‌జా రెడ్డి అల్లుడు వంటి చిత్రాల తో పరాజయాల పక్కన ఉన్న చైతూ కి మ‌జిలీ చిత్రం హిట్ కొట్టడం తో కాస్త ఊర‌ట‌నిచ్చింది.చాటు,శ్యామ్ ల పెళ్లి అయిన తరువాత వారిద్దరూ కలిసి తొలిసారి నటించిన చిత్రం మజిలీ.

Advertisement

ఈ చిత్రం చైతూ కి విజయాన్ని అందించడం తో కొంచం ప్రశాంతంగా ఉన్న చైతూ కి శేఖ‌ర్ క‌మ్ముల కూడా గిఫ్ట్ ఇస్తాడా అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు