Vijayawada Spa Centers : విజయవాడలోని స్పా సెంటర్లపై ఎస్ఈబీ ఆకస్మిక దాడులు

విజయవాడలోని పలు స్పా సెంటర్లపై( Spa Centers ) ఎస్ఈబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.

రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు స్పా సెంటర్లలో సోదాలు జరిపారు.

స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం జరుగుతుందన్న పక్కా సమాచారంతో అధికారులు దాడులు( SEB officials ) నిర్వహించారు.మొత్తం 62 మంది అధికారులు పది బృందాలుగా ఏర్పడి పటమట, మాచవరం, పెనమలూరు మరియు ఎస్ఆర్ పేటలోని స్పా సెంటర్లలో సోదాలు జరిపారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే స్పా సెంటర్ల నుంచి ముగ్గురు థాయిలాండ్ మహిళలు సహా 25 మందికి పోలీసులు విముక్తి కల్పించారు.అనంతరం 25 మంది విటులతో పాటు ఐదుగురు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్పా సెంటర్లు, నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.

అద్భుతం చేసిన టీమిండియా.. రెండో టెస్టులో ఘనవిజయం!
Advertisement

తాజా వార్తలు