బీబీసీపై చర్యలకు గుజరాత్ అసెంబ్లీలో తీర్మానం..!

గుజరాత్ అసెంబ్లీ కీలక తీర్మానం చేసింది.2002లో జరిగిన అల్లర్లపై మోదీ హస్తం ఉందంటూ బీబీసీ డాక్యుమెంటరీ రూపొందించిన విషయం తెలిసిందే.

ఈ వీడియోపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ప్రసారాన్ని నిలిపివేయడంతో పాటు ట్విట్టర్, యూట్యూబ్ లింక్ లను షేర్ చేయరాదంటూ ఆదేశాలు జారీ చేసింది.తాజాగా ఈ వీడియోపై గుజరాత్ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది.

బీబీసీపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానాన్ని పంపింది.కాగా ఈ డాక్యుమెంటరీ దేశ ప్రజలందరికీ వ్యతిరేకమని గుజరాత్ హోంమంత్రి హర్ష సాంఘ్వీ తెలిపారు.

ఫ్యూచర్ లో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ ముగ్గురి మీదనే ఆధారపడి ఉందా..?
Advertisement

తాజా వార్తలు