బెంగుళూరు లో కుప్పకూలిన భవనం! కొనసాగుతున్న సహాయక చర్యలు

నిర్మాణంలో ఉన్న ఓ భవనం బెంగుళూరులో దరవాడ ప్రాంతంలో నిన్న సాయంత్రం కుప్పకూలిన సంగతి తెలిసిందే.

ఈ భవనం శిథిలాల క్రింద వందల మంది చిక్కుకున్నట్లు తెలుస్తుంది.

ఈ నేపధ్యంలో రెస్క్యూ ఆపరేషన్ మొదలెట్టిన హుటాహుటిన శిథిలాలు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.ఇప్పటి వరకు శిథిలాలలో చిక్కుకున్న 37 కార్మికులని బయటకి తీసుకొచ్చారు.

ఇదిలా ఉంటే ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఇద్దరు మరణించగా మరో ఐదుమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.ఇంకా ఈ శిథిలాలలో చాలా మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తుంది.

భవనం నాణ్యతాలోపం, అలాగే సామర్ధ్యానికి మించి నిర్మించడం వలెనే కూలిపోయి ఉంటుంది అని అధికారులు భావిస్తున్నారు.దీనిపై కమిటీ వేసి విచారణ చేయించేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధం అవుతుంది.

Advertisement
వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

తాజా వార్తలు