రాణి కమలాపతి గోండు సమాజంతో పాటు భోపాల్ చివరి హిందూ రాణి.18వ శతాబ్దంలో ఈమో భోపాల్ ప్రాంతంలో పరిపాలించింది.
రాణి కమలాపతి అందం, ధైర్యసాహసాలకు ప్రసిద్ధి.
మధ్యప్రదేశ్ ప్రజలు ఇప్పటికీ ఆమె తెలివితేటలు, ధైర్యం గురించి మాట్లాడుకుంటారు.ఆమె తండ్రి రాజా కిర్పాల్ సింగ్ సిరౌటియా సల్కాన్పూర్ రాచరిక రాష్ట్రమైన సెహోర్కు రాజు.రాణి కమలాపతి గుర్రపుస్వారీ, మల్లయుద్ధం, విలువిద్యలో ఎంతో నైపుణ్యం ఉంది.
ఆక్రమణదారుల నుండి తన రాజ్యాన్ని రక్షించుకోవడానికి ఆమె తన మహిళా బృందంతో పోరాడింది.రాణి కమలాపతి గిన్నౌర్ఘర్కు చెందిన రాజా సూరజ్ సింగ్ షా కుమారుడు నిజాం షాకు జన్మించింది.ఇది భోపాల్ నుండి దాదాపు 55 కిలోమీటర్ల దూరంలో ఉంది.1700లో తన భార్యపై ప్రేమకు చిహ్నంగా రాజు నిజాం షా భోపాల్లోని సరస్సు ముందు ఏడు అంతస్తుల ప్యాలెస్ను నిర్మించాడు, దీనిని నేడు రాణి కమలాపతి మహల్ అని పిలుస్తారు.ఈ ప్యాలెస్ లఖోరీ ఇటుకలతో నిర్మించారు.రాజభవనంలోని మార్గాలు రాణి గౌరవార్థం తామరపువ్వు ఆకారంలో నిర్మించారు.1989లో, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీనిని తన రక్షణలోకి తీసుకుంది.సల్కాన్పూర్కు చెందిన చైన్సింగ్ రాణి కమలాపతిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.
కానీ రాణి కమలాపతి గోండు రాజు నిజాం షాను వివాహం చేసుకుంది.ఆ తర్వాత నిజాం షాను హత్య చేసేందుకు చైన్ సింగ్ అనేక ప్రయత్నాలు చేశాడు.
చివరికి నిజాం షా మేనల్లుడు ఆలం షా సహాయంతో గిన్నౌర్గఢ్ కోటపై దాడి చేశాడు.ఈ దాడిలో రాణి తన కొడుకుతో సహా ఎలాగోలా తప్పించుకుంది.
అతని నుండి తప్పించుకోవడానికి రాణి కమలాపతి రాజు నిజాం షా నిర్మించిన ఏడు అంతస్తుల ప్యాలెస్ను ఆశ్రయించింది.తరువాత రాణి కమలాపతి ఆఫ్ఘన్ సర్దార్ దోస్త్ మొహమ్మద్ సహాయంతో చైన్ సింగ్తో పాటు నిజాం షా మేనల్లుడు ఆలం షాను చంపడం ద్వారా తన భర్త మరణానికి ప్రతీకారం తీర్చుకుంది.
చైన్ సింగ్ హత్య తర్వాత దోస్త్ మహ్మద్ ఖాన్ దృష్టి గిన్నౌర్గర్ సింహాసనంపై పడింది.అయితే చైన్ సింగ్ను చంపిన తర్వాత రాణి కమలాపతి తన 14 ఏళ్ల కుమారుడు నవల్ షా గిన్నౌర్గర్ సింహాసనాన్ని అధిష్టించాడు.గిన్నౌర్ఘర్లో బలమైన రాజు లేకపోవడంతో దోస్త్ మహ్మద్ ఖాన్ గిన్నౌర్గర్ కోటపై దాడి చేశాడు.
అయితే రాణి,ఆమె స్నేహితుడు మహ్మద్ ఖాన్ ధైర్యంగా అతనిని ఎదుర్కొన్నారు.అతను వారి కొడుకును దారుణంగా హత్య చేసినప్పుడు, రాణి నిరాశలో కుంగిపోయింది.ఇక తమ ప్రజలను రక్షించుకోలేనని భావించి ఆమె సరస్సులో దూకి జలసమాధి అయ్యింది.1723లో రాణి కమలాపతి మరణం తర్వాత, భోపాల్ను దోస్త్ మహ్మద్ ఖాన్ నాయకత్వంలో నవాబులు పరిపాలించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy