రాజకీయాలు పక్కనబెట్టిన మాజీ మంత్రి.. బావిలో దూకి ఏం చేశాడో తెలుసా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీసీసీ చీఫ్‌గా వ్యవహరించిన రఘువీరా రెడ్డి, ఆ తరువాత ఎన్నికల్లో తమ పార్టీ ఓటమి పాలవ్వడంతో నెమ్మదిగా రాజకీయాలకు దూరం అవుతూ వచ్చాడు.

ఆ తరువాత ఆయన తన వ్యక్తిగత జీవితంలో నమగ్నమై పోయారు.

వ్యక్తిగత జీవితంతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆయన తన సొంత ఊరిలో సరదాగా జీవితం గడుపుతున్నారు.తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అనంతపురం జిల్లా నీలకంఠపురములోని వ్యవసాయ క్షేత్రంలో ఆయన ఓ బావిలో దూకి సరదాగా ఈత కొడుతూ కనిపించాడు.ఈ క్రమంలో పక్కనే ఉన్న బీసీ హాస్టల్ విద్యార్ధులతో రఘువీరా ఈత కొట్టడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ఈ వయసులో కూడా ఆయన ఈత కొట్టే విధానం చూసి విద్యార్ధులు అవాక్కయ్యినట్లు తెలుస్తోంది.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

Advertisement

మరి రఘువీరా శాశ్వతంగా రాజకీయాలకు దూరం అవుతున్నారా అనే ప్రశ్నకు ఆయన ఏ సమాధానం చెబుతారో చూడాలి.

నరదిష్టి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?
Advertisement

తాజా వార్తలు