ఢిల్లీలో సీఎం జగన్ కామెంట్స్ పై సీజేఐకి లేఖ రాసిన రఘురామకృష్ణరాజు..!!

నేడు ఢిల్లీలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సన్నాహక సదస్సులో సీఎం జగన్ పాల్గొనడం తెలిసిందే.

ఈ సమావేశానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల పారిశ్రామికవేత్తలు పలు అంతర్జాతీయ కంపెనీల సీఈవోలు పాల్గొనడం జరిగింది.

పెట్టుబడులను ఆకర్షించే విధంగా సీఎం జగన్ ప్రసంగించారు.అయితే తన ప్రసంగంలో ఏపీ రాజధాని విశాఖేనని.

త్వరలో తాను కూడా విశాఖపట్నం షిఫ్ట్ కాబోతున్నట్లు తెలిపారు.దీంతో సీఎం జగన్ రాజధానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కు లేఖ రాశారు.

సుప్రీంకోర్టులో ఏపీ రాజధానికి సంబంధించిన అంశం విచారణకు వచ్చే సమయంలో సీఎం జగన్ ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఉందని లెక్కలో స్పష్టం చేశారు.నియమావళి ప్రకారం దీన్ని కోర్టు ధిక్కరణగానే భావించాలని అన్నారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన కామెంట్లు న్యాయవ్యవస్థ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే విధంగా ఉన్నాయని ఆరోపించారు.

Advertisement

ఈ క్రమంలో కోర్టు పరిధిలో ఉన్న రాజధాని అంశంపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోవాలని సీజేఐకి రఘురామకృష్ణరాజు లెటర్ రాశారు.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు