కఠిన చర్యలు తప్పవు ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు..!!

ఒడిస్సా రైలు ప్రమాదం( Odisha Train Accident ) పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ ఘోరమైన ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదే సమయంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ దుర్ఘటనపై క్షేత్రస్థాయి దర్యాప్తు ఆదేశించినట్లు స్పష్టం చేశారు.

Prime Minister Modi's Sensational Comments Must Take Strict Action, Prime Minist

ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో రైలు ప్రమాదం జరిగిన ప్రదేశంలో ప్రధాని మోదీ( PM Narendra Modi ) పర్యటించడం జరిగింది.ఘటనా స్థలాన్ని స్వయంగా పరిశీలించి.

అధికారుల వద్ద వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగింది.ఇదే సమయంలో స్థానికులు చాలా సహాయం చేశారు.

Advertisement

అదేవిధంగా క్షతగాత్రులను తరలించడంతోపాటు రక్తదానం కూడా చేశారు అని మీడియా సముకంగా ప్రశంసించారు.అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి గాయపడిన వారికి అత్యుత్తమ చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు.

జరిగిన ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేయడం జరిగింది.ఈ రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 288 మంది మరణించగా.747 మందికి గాయాలు కాగా అందులో 56 మందికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు వెల్లడించడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు