జిల్లాల పర్యటనలో బిజిబిజీగా గులాబీ బాస్..!!

గులాబీ బాస్, సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటిస్తూ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.ఇందులో భాగంగా ఇవాళ జడ్చర్ల, మేడ్చల్ లో కేసీఆర్ పర్యటించి ప్రచారం చేయనున్నారు.

ఈ క్రమంలోనే రెండు ప్రాంతాల్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు.ఇందుకోసం బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు.

అయితే ముందుగా ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి జడ్చర్ల వెళ్లనున్న సీఎం కేసీఆర్ అక్కడ ఏర్పాటు చేసే ప్రజా ఆశీర్వాద సభకు హాజరవుతారు.తరువాత మేడ్చల్ కు వెళ్లనున్న కేసీఆర్ సాయంత్రం 4 గంటలకు అక్కడి సభలో పాల్గొంటారు.

కాగా లక్ష మంది జనసమీకరణతో మేడ్చల్ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తుంది.

Advertisement
కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ మృతి

తాజా వార్తలు