జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) 2024 ఎన్నికలలో పిఠాపురం నియోజకవర్గం( Pithapuram Constituency ) నుండి పోటీ చేస్తున్నారు.
ఎట్టి పరిస్థితులలో ఈ ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలవాలని అసెంబ్లీలో అడుగు పెట్టాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు.
దీంతో పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.మంగళవారం పిఠాపురం నియోజకవర్గం నుండి పలువురు నాయకులు జనసేన పార్టీలో( Janasena Party ) జాయిన్ అవ్వటం జరిగింది.
దీంతో మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో.సదరు నాయకులకు పవన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.పిఠాపురంలో తనని ఓడించేందుకు ప్రత్యర్ధులు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు.
అక్కడ వైసీపీ నుండి పోటీ చేస్తున్న వంగా గీత జనసేనలో చేరాలని ఆహ్వానించారు.
పిఠాపురాన్ని దేశంలో ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేస్తానని స్పష్టం చేశారు.ఒక ఎమ్మెల్యే తలుచుకుంటే ఎలా అభివృద్ధి చెయ్యొచ్చో చూపిస్తానని అన్నారు.పిఠాపురం నియోజకవర్గాన్ని తన స్వస్థలం చేసుకుంటానని.అక్కడ నుంచి రాష్ట్ర దశ దిశా మారుస్తానని పేర్కొన్నారు.2019 ఎన్నికలలో భీమవరం, గాజువాక నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు.ఈసారి ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలని ఎమ్మెల్యేగా గెలవాలని పవన్ ఆశిస్తున్నారు.
మరి పిఠాపురం ప్రజలు జనసేన పార్టీని ఆదరిస్తారో లేదో చూడాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy