ఇవాళ చర్చకు రానున్న అవిశ్వాస తీర్మానం..!!

కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం ఇవాళ చర్చకు రానుంది.ఈ మేరకు మధ్యాహ్నం 12 గంటలకు కేంద్రంపై అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది.

కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ రాహుల్ గాంధీ అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభించే అవకాశం ఉంది.ఈ క్రమంలో ఇవాళ, రేపు అవిశ్వాసంపై చర్చ నిర్వహించనున్నారు.

కాగా గత కొన్ని రోజులుగా మణిపూర్ అంశంపై అధికార, విపక్షాల మధ్య వాదోపవాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలోనే విపక్ష పార్టీలు కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించింది.

దీనిపై ఇవాళ చర్చను ప్రారంభించనున్నట్లు స్పీకర్ వెల్లడించారు.

Advertisement
వాడిన కాఫీ పొడిని మ‌ళ్లీ ఇలా కూడా వాడొచ్చు.. తెలుసా?