Chandrababu Naidu Jagan Galla Jayadev: గల్లాతో జగన్‌ను చంద్రబాబు టార్గెట్ చేశారా?

వింటర్‌ సీజన్‌లో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం చాలా వేడెక్కుతోంది, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అవకాశం దొరికినప్పడల్లా జగన్‌ను టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.2024 ఎన్నికలలో మళ్లీ అధికారంలోకి రావడానికి టీడీపీ అధినేత ఏ అవకాశాన్ని వదలకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అనర్హులుగా చిత్రీకరిస్తూ వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు.

  గంటా, గంటకూ, రోజుకో ప్రభుత్వ వ్యతిరేక, జగన్ వ్యతిరేక కథనాలను తన అనుకూల మీడియా ద్వారా  ఢంకా బజాయించుకుంటున్నారు.

  ఇది చాలదన్నట్లుగా చంద్రబాబు నాయుడు తన పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌ను ఉపయోగించుకుని జగన్ మోహన్ రెడ్డి పాలనపై అసంతృప్తి కలిగే విధంగా భిన్నమైన ఎత్తుగడ వేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.అమర రాజా గ్రూప్‌ అధినేత గల్లా జయదేవ్‌ పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో రూ.9,500 కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించారు. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంపై  టార్గెట్ చేసేందకు చంద్రబాబు ఈ ప్లాన్‌ను ఉపయోగించుకుని ఆంధ్రప్రదేశ్‌కు పరిశ్రమలు రావడం లేదని, ఇప్పటికే ఇక్కడ ఉన్నవి ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని ప్రచారం చేస్తున్నారు.

పారిశ్రామికవేత్తలను జగన్ మోహన్ రెడ్డి వేధిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ నుంచి అమరరాజు నిష్క్రమించడమే అందుకు ఉదాహరణ  ప్రజలకు చెబుతున్నారు. 

సోషల్ మీడియా ద్వారా ఈ వార్త విసృత్గంగా ప్రచారం జరిగే విధంగా చేస్తున్నారు.ప్రస్తుతం ఈ విషయం తీవ్రమైన చర్చ కూడా జరుగుతుంది.పరిశ్రమల విషయంలో జగన్ వైఖరి బాగొలేదని నిరుద్యోగులు కామెంట్స్ చేస్తున్నారు.అలాగే ఈ విషయ్ం వైసీపీ నాయకులు కూడా ఎదురు దాడికి దిగుతున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడుకు సహాయం చేయడానికి గల్లా కుటుంబం ఆడిన రాజకీయ క్రీడ మాత్రమే తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అమరరాజు ఎత్తుగడ అంటున్నారు.

Advertisement
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

తాజా వార్తలు