ఒకే సినిమాతో నందమూరి ఫ్యామిలీలో ఇద్దరి జాతకం తేలిపోనుందా.. అసలేం జరిగిందంటే?

సినిమా ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి నందమూరి తారకరామారావు( Nandamuri Tarakara Rao ) ఇండస్ట్రీలో ఎంతో అద్భుతమైన నటుడిగా పేరు ప్రఖ్యాతలు పొందారు.

ఇక ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకొని నందమూరి నట సింహం బాలకృష్ణ కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.

అయితే బాలయ్య ఇప్పటికి వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.అయితే బాలయ్య( Balayya ) వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

బాలకృష్ణ సినీ ఎంట్రీ అదిగో ఇదిగో అంటూ ఇప్పటికే మూడు సంవత్సరాలు పూర్తి అయింది కానీ ఈ ఏడాది మాత్రం ఈయన కచ్చితంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.హనుమాన్ సినిమా ద్వారా సిల్వర్ స్క్రీన్ పై రికార్డులు సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ( Director Prashanth Verma ) మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని తెలుస్తుంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చర్చలన్నీ పూర్తి అయ్యాయని త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన కూడా రాబోతుందని తెలుస్తోంది.

ఇక బాలకృష్ణ కొన్ని సెంటిమెంట్లను బాగా నమ్ముతారు ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆషాడం తర్వాత మూఢం ఉండడంతో మూఢం పూర్తి కాగానే తన కొడుకు సినిమా గురించి అధికారిక ప్రకటన రాబోతుందని తెలుస్తోంది.అయితే ఈ సినిమా ద్వారా మోక్షజ్ఞ ( mokshagna )మాత్రమే కాకుండా బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని( Tejaswini ) కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు.అయితే ఈమె నటిగా కాకుండా నిర్మాతగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.

Advertisement

ఇప్పటికే తేజస్విని అఖండ సీక్వెల్ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఇక తన తమ్ముడు మోక్షజ్ఞ సినిమా నిర్మించడానికి బ్రాహ్మిణి తేజస్విని పోటీ పడినప్పటికీ చివరికి తేజస్విని ఆ అవకాశాన్ని దక్కించుకున్నారు.

మరి మోక్షజ్ఞ ఈ ఒక్క సినిమా ద్వారా ఈ ఇద్దరి నందమూరి వారసుల జాతకం తెలియనుంది.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీ లీల నటిస్తోందంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు