మంత్రి ప్రశాంత్‌ రెడ్డిని పరామర్శించిన కేటీఆర్‌..

మాతృవియోగంతో బాధలో ఉన్న మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డిని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ పరామర్శించారు.

నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు మంత్రి కేటీఆర్‌.

మంజులమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.వేముల కుటుంబ సభ్యులను ఓదార్చారు.

ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రశాంత్‌రెడ్డి మాతృమూర్తి వేముల మంజులమ్మ ఈ నెల 12న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రి లో కన్నుమూసిన విషయం తెలిసిందే.

ఒత్తైన జుట్టును కోరుకునే పురుషులకు వండర్ ఫుల్ క్రీమ్.. వారానికి ఒక్కసారి వాడినా చాలు!
Advertisement

తాజా వార్తలు