ఏపీలో టీడీపీ.జనసేన.
బీజేపీ( TDP Janasena BJP Alliance ) మూడు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి.
గతంలో 2014 ఎన్నికలలో విభజన జరిగిన తర్వాత ఏపీలో ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి గెలవడం జరిగింది.
ఆ సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena Pawan Kalyan ) కేవలం మద్దతు తెలిపారు ఎక్కడ పోటీకి దిగలేదు.కానీ ఇప్పుడు ఈ మూడు పార్టీలు కూటమిలో ఏర్పడి పోటీకి దిగుతున్నాయి.
గత రెండు రోజులు ఢిల్లీలో చంద్రబాబు పవన్.బీజేపీ పెద్దలతో సమావేశాలు నిర్వహించారు.
ఈ క్రమంలో పొత్తు ఖరారు చేసుకోవడం జరిగింది.దీంతో ఏపీలో సరికొత్త రాజకీయ వాతావరణం నెలకొంది.2019 కంటే 2024 ఎన్నికలకి( 2024 Elections ) ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.
ఈ ఎన్నికలలో ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా.చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జాగ్రత్త పడటం జరిగింది.రెండోసారి వైసీపీ( YCP ) అధికారంలోకి రాకుండా ఇద్దరు నేతలు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఈ క్రమంలో బీజేపీతో పొత్తు ఖరారు కావటం సంచలనంగా మారింది.బీజేపీతో టీడీపీ పొత్తు అనంతరం వైసీపీ పార్టీ కీలక నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఎన్నికలలో చంద్రబాబు ఏనాడైనా ఒంటరిగా పోటీ చేశారా అని మంత్రి గుడివాడ అమర్నాథ్( Minister Gudivada Amarnath ) నిలదీశారు.జగన్ ను ఎదురుకోలేక పొత్తులు పెట్టుకుంటున్నారు.
విపక్షాల పొత్తు కుయుక్తులను ప్రజలు గమనిస్తున్నారు.విపక్షాలను చూస్తేనే వైసీపీ బలం అర్థమవుతోంది.
చంద్రబాబు రాష్ట్రంలో అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు.పవన్.
చంద్రబాబు ఢిల్లీ వీధులలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు అని గుడివాడ అమర్నాథ్ మండిపడటం జరిగింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy