బాబు చెప్పి బీజేపీలో జాయిన్‌ అవుతున్నా

ఏపీలో రాజకీయాలు చాలా స్పీడ్‌గా మారుతున్నాయి.

వంద రోజుల ముందు వరకు అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీ నుండి ప్రస్తుతం కీలక నాయకులు అంతా దూరం అవుతున్నారు.

ప్రస్తుతం ఏపీలో వైకాపా అధికారంలో ఉంది.అధికారంలో ఉన్న వైకాపా తెలుగు దేశం పార్టీ నాయకులను ఆకర్షించడం లేదు.

కాని బీజేపీ మాత్రం తెలుగు దేశం పార్టీ నాయకులు వస్తే చేర్చుకునేందుకు అర్రులు చాచి ఉంది.తాజాగా తెలుగు దేశం పార్టీకి చెందిన సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా బీజేపీలో జాయిన్‌ అయ్యాడు.

తాజాగా ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీలో ఉంటే వైకాపా వారు తీవ్రంగా టార్గెట్‌ చేస్తున్నారు.నాకు తెలుగు దేశం పార్టీతో ఎలాంటి ఇబ్బంది లేదు.

Advertisement

కాని తెలుగు దేశం పార్టీలో నేను ఉంటే నా కార్యకర్తలు ఇబ్బందులకు గురి అవుతున్నారు.అందుకే తెలుగు దేశం పార్టీ కంటే బలమైన పార్టీ అయిన బీజేపీలో జాయిన్‌ అవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా ఆయన ప్రకటించాడు.

తాను చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఆయతో చర్చించిన తర్వాతే బీజేపీలో జాయిన్‌ అవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా ఆదినారాయణ రెడ్డి అన్నాడు.

Advertisement