ఆ ప్రాంతంలో ఖరీదైన ప్రాపర్టీని కొనుగోలు చేసిన చిరంజీవి.. ఎన్ని రూ.కోట్లంటే?

మెగాస్టార్ చిరంజీవి గురించి మనందరికీ తెలిసిందే.

ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.

అంతే కాకుండా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.ఇకపోతే చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

ఈ వయసులో కూడా అదే ఊపుతూ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు.సినిమాలలో, యాడ్స్ లో నటిస్తూ బాగానే ఆస్తులను కూడా పెట్టుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.

ఆయన దగ్గర ప్రస్తుతం కోట్ల విలువ చేస్తే ఆస్తులు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే.లేకపోతే గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో(social media) మెగాస్టార్ ప్రాపర్టీస్ కి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది.అదేమిటంటే మెగాస్టార్ చిరంజీవి ఊటి లోనే ఒక కొండ ప్రాంతంలో ఒక ప్రాపర్టీని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.

Advertisement

దేశ వ్యాప్తంగా ఉన్న చాలామంది సెల‌బ్రిటీలు త‌మ‌సెల‌వుల‌ను గ‌డ‌ప‌డానికి ఊటీలో బంగ్లాలు కొన‌డం, కొత్త‌వి నిర్మించుకోవ‌డం చేస్తూ ఉన్నారు.ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే త‌మిళనాట అనేక మంది సినిమా తార‌ల‌కు అక్క‌డ సొంత ఫామ్ హౌజ్‌లు ఉండ‌గా ఇటీవ‌ల క‌న్న‌డ‌, బాలీవుడ్‌తో పాటు మ‌న తెలుగు సినీ ప్ర‌ముఖులు ఊటీలో విలాస‌వంత‌మైన స్థ‌లాలు, బంగ్లాలు కొనుగోలు చేస్తున్నారు.

తాజాగా ఆ లిస్టులో మ‌న మెగాస్టార్ చిరంజీవి చేరి పోయారు.చిరంజీవి తాజాగా త‌మిళ‌నాడులోని ఊటీ అవుట్ స్కర్ట్స్ లో ఓ స్థ‌లాన్ని కొనుగోలు చేశారు.చుట్టూ టీ గార్డెన్స్ మ‌ధ్య మంచి వ్యూ పాయింట్‌లో 5.5 ఎక‌రాల విస్తీర్ణంలో ఉన్న ప్రాప‌ర్టీని ఇటీవ‌లే చిరంజీవి స్వ‌యంగా చూసి వెంట‌నే కొనుగోలు చేశార‌ని దాని విలువ సుమారు రూ.16 కోట్లకు పైనే ఉంటుంద‌ని వినిపిస్తోంది.దానికి సంబంధించి రిజిస్టేష‌న్ వ్య‌వ‌హ‌రాలు కూడా పూర్త‌య్యాయ‌ని స‌మాచారం.

ఇప్ప‌టికే ఈ స్థ‌లాన్ని రామ్ చ‌ర‌ణ్ ఉపాస‌న దంప‌తులు వెళ్లి చూసి వ‌చ్చార‌ని, త్వ‌ర‌లోనే అనుభ‌వం క‌లిగిన ఆర్కిటెక్స్ట్ ఆధ్వ‌ర్యంలో ఒక ఫామ్ హౌజ్ నిర్మించ‌డానికి ఫ్లాన్ చేస్తున్నార‌ని, ప్ర‌స్తుతం అనుమ‌తుల కోసం వేచి చూస్తున్నార‌ని సమాచారం.

పొట్టి పొట్టి దుస్తుల్లో సెగలు పుట్టిస్తున్న ప్రగ్యా జైస్వాల్..
Advertisement

తాజా వార్తలు