మరో నాలుగు చిత్రాలు వారివే అంటోన్న మహేష్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు చిత్ర సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూ హాలీడేస్‌కు వెళ్లాడు.

ఈ సినిమాతో మహేష్ తన కెరీర్‌లో మరో బ్లాక్ బస్టర్ మూవీని అందుకున్నాడు.

కాగా తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే లైన్‌లో పెట్టిన మహేష్, అతి త్వరలో ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను మొదలుపెట్టనున్నాడు.ఈ సినిమా తరువాత మహేష్ తన నెక్ట్స్ ప్రాజెక్టులను కూడా లైన్‌లో పెట్టాడు.

దర్వకుడు వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో తన తాజా చిత్రాన్ని తెరకెక్కించనున్న మహేష్, ఆ తరువాత తన 28వ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తీయనున్నాడట.గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన అతడు, ఖలేజా చిత్రాలకు మంచి ఆదరణ లభించడంతో మరోసారి ఈ కాంబో మనముందుక రానుంది.

ఇక తనకు సరిలేరు నీకెవ్వరు సినిమాను అందించిన అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మహేష్ తన 29వ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు.ఆ తరువాత మరోసారి శ్రీమంతుడు, భరత్ అనే నేను డైరెక్టర్ కొరటాల శివతో మహేష్ నటించనున్నాడు.

Advertisement

తన కెరీర్‌లో 30వ చిత్రంగా ఈ సినిమా రానుంది.మొత్తానికి మహేష్ వరుసబెట్టి స్టార్ డైరెక్టర్లతో తన సినిమాలను లైన్‌లో పెట్టి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు.

మరి మహేష్‌కు ఎవరు ఎలాంటి హిట్‌ను అందిస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు