ఈనెల 22న మచిలీపట్నం పోర్టు పనులు ప్రారంభం

మచిలీపట్నం పోర్టు పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని మంత్రి రోజా తెలిపారు.ఈ మేరకు ఈనెల 22న సీఎం జగన్ ఆ పనులను ప్రారంభిస్తారన్నారు.

ముందుగా గుడివాడలోని తొమ్మిది వేల టిడ్కో గృహ సముదాయాన్ని ప్రారంభించనున్నారని పేర్కొన్నారు.తరువాత మచిలీపట్నం పోర్టు పనులకు ఆయన భూమి పూజ చేస్తారని మంత్రి రోజా వెల్లడించారు.

ఈ నేపథ్యంలోనే మచిలీపట్నంలో 2,145 టిడ్కో ఇళ్లను ప్రజలకు అందిస్తారని చెప్పారు.టీడీపీ హయాంలో ఎన్నికల ముందు భూమి పూజ చేసి వదిలేశారని మండిపడ్డారు.

జగన్ భూమి పూజ చేసిన ప్రతి కార్యక్రమాన్ని పూర్తి చేశారని వెల్లడించారు.చంద్రబాబు ఎక్కడెక్కడో సెల్ఫీలు దిగుతారన్న మంత్రి రోజా ఇప్పుడు గుడివాడలో నిర్మించిన టిడ్కో గృహాల దగ్గరకు వచ్చి నాని అన్నతో సెల్ఫీ దిగే దమ్ముందా అని ప్రశ్నించారు.

Advertisement

నాలుగేళ్లలో నాలుగు పోర్టులు తీసుకొచ్చిన ఘనత జగన్ ది అని రోజా కొనియాడారు.

దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు