ఏపీలో నకిలీ సర్టిఫికెట్లతో లాయర్ల ప్రాక్టీస్..!

ఏపీలో నకిలీ సర్టిఫికెట్లతో న్యాయవాదులుగా ప్రాక్టీస్ చేస్తున్న వ్యవహారం కలకలం రేపుతోంది.దాదాపు పదకొండు ఏళ్లుగా లాయర్లుగా చెలామణీ అవుతున్నారు.

దీన్ని తీవ్రంగా పరిగణించిన ఏపీ హైకోర్టు బార్ కౌన్సిల్ తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో నకిలీ న్యాయవాదులపై కేసులు నమోదు అయ్యాయి.

ఈ క్రమంలో మొత్తం 15 మంది నకిలీ లాయర్లను బార్ కౌన్సిల్ గుర్తించింది.వీరిలో ఎనిమిది మంది న్యాయవాదులు స్వచ్ఛంధంగా ముందుకు వచ్చి తమ పేరును ఉపసంహరించుకున్నారు.

మరో ఏడుగురిపై పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు