కాసేపట్లో రాజ్ భవన్‎కు కేసీఆర్..!

తెలంగాణ సీఎం కేసీఆర్ మరికాసేపటిలో రాజ్ భవన్ కు వెళ్లనున్నారు.ఈ మేరకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు కేసీఆర్ రాజీనామా సమర్పించనున్నారు.

కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం దిశగా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే సుమారు 56 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు.

ఇంకా తొమ్మిది నియోజకవర్గాల్లో ఆధిక్యతను కనబరుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ విజయం ఖాయమని తెలుస్తోంది.ఈ క్రమంలోనే కేసీఆర్ రాజీనామా చేసేందుకు సిద్ధం అయ్యారని సమాచారం.

కాఫీ, టీ తాగే ముందు మంచినీళ్లు తాగితే మంచిదా..కాదా?
Advertisement

తాజా వార్తలు