ప్రతి హామీని అమలు చేసిన ఏకైక నేత జగన్..: మంత్రి కొట్టు

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కాపు నేస్తం బహిరంగ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలపై మండిపడ్డారు.

టీడీపీ అధినేత చంద్రబాబు 14 ఏళ్ల పాటు పాలన చేసినా చెప్పుకునేందుకు ఒక్క మంచి పథకం లేదని మంత్రి కొట్టు అన్నారు.కానీ ఇచ్చిన ప్రతి హమీని అమలు చేసిన ఏకైక నాయకుడు జగన్ అని తెలిపారు.

చంద్రబాబులో ఏం నచ్చిందని ఓటేయాలని పవన్ చెప్తున్నారో అర్థం కావడం లేదన్నారు.చంద్రబాబు హయాంలో జరిగిన తప్పులపై పవన్ ప్రశ్నించరా అని నిలదీశారు.

పవన్ కు డబ్బు సంపాదించడం తప్ప ఏమీ తెలియదని విమర్శించారు.తాడేపల్లిగూడెంలో త్వరలోనే మల్టీ చిల్డ్రన్ ఆస్పత్రికి సీఎం జగన్ భూమి పూజ చేస్తారన్న మంత్రి కొట్టు ఇండోర్ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు.

Advertisement
Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide