దేశ వ్యాప్తంగా పలు సంస్థలు చేస్తున్న సర్వే నివేదికలు బయటకు వస్తున్నాయి దేశంలో, రాష్ట్రంలో ప్రజల మూడు ఏమిటో అందరికీ అర్దమవుతుంది దేశంలో మోడీ( Narendra Modi )గ్రాఫ్ క్రమక్రమంగా పెరుగుతుంది వచ్చే ఎన్నికల నాటికి ఆయనకు ప్రజల్లో అభిమానం బాగా పెరిగింది హిందూ ధర్మాన్ని ప్రపంచ వ్యాప్తం చేస్తేనే మోడీకి ప్రజాభిమానం పెరిగినట్లు కాదు నేడు ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూసే స్థాయిలో మోడీ పాలన సాగింది సంక్షేమం, అభివృద్ది ని రెండూ సమాంతరంగా తీసుకెళ్లి మోడీ పేదల పెన్నిధిగా మారారుపేదలకు ఆరోగ్య భద్రత, ఆహార భద్రత తో ఒక భరోసా కల్పించారు జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులతో ప్రజల ప్రయాణాలను వేగవంతం చేశారు దేశ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసి, డిజిటలైజ్ చేశార సీమాంధ్ర ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించిన ఘనత మోడీదిదేశంలో ఆక్రమణ దారుల చొరబాటు అనేది లేకుండా నివారించారు నేడు భారత్( India ) అన్ని రంగాల్లో అభివృద్ది దిశగా అడుగులు వేస్తుంది కుల కుటుంబ పార్టీల వైపు చూసేందుకు నేడు ప్రజలు ఆసక్తి చూపడం లేదు మరి ఎపీలో ప్రజల మనోగతం ఎలా ఉందో అందరూ ఆలోచన చేయండి 99శాతం హామీలు అమలు చేశామని వైసీపీ అబద్దాలు చెబుతుందిసంక్షేమం, అభివృద్ది రెండూ చేయాలనే కనీస జ్ఞానం కూడా వైసీపీకి లేదు కేవలం సంక్షేమం పేరు చెప్పి.
అప్పులు చేయడమే జగన్ కు తెలుసు అభివృద్ది అనేది ఎపీలో ఎక్కడ ఉందో చూపించాలి.
మద్యం ఏరులై పారిస్తూ.వేల కోట్లు రూపాయలు దోచుకున్నారుపేదల ప్రాణాలు తీసి, మహిళల పుస్తెలు తెంపడంలో 99శాతం విజయం సాధించారుమైనింగ్, ఇసుకను కొల్లగొట్డంలో, భూ కబ్జాలకు పాల్పడంలో 99శాతం ఘనత సాధించారు భవిష్యత్ లో కొండలు అంటే గూగుల్ చూపించే స్థాయికి తీసుకు వచ్చారుప్రజల పై పన్నుల మోత, ఛార్జీల పెంపుతో 99శాతం విజయం సాధించారు మీ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడంలో 99శాతం విజయం సాధించారుప్రజల రక్తాన్ని జలగల్లా పట్టి పీడించడంలో వైసీపీ నేతలు విజయవంతం అయ్యారు ఇలా వైసీపీ వైఫల్యాలు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి అయినా సిగ్గు లేకుండా సిద్దమా అని మళ్లీ అడుగుతున్నారు99శాతం అన్నీ లాక్కుని.
ఉన్న ఒక్క శాతం కూడా లేకుండా చేద్దామనే సిద్దం అని వస్తున్నారా మద్యమపాన నిషేధం అన్న వ్యక్తి.మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు మహిళలపై అత్యాచారాలు, గంజాయి రవాణా పెరిగినా.
చర్యలు లేవు.చాలా చోట్లా పోలీసులే వైసీపీ( YCP ) కార్యకర్తలుగా పని చేస్తున్నారుమీ నవరత్నల్లో 99శాతం అమలు చేశామని చెప్పడానికి సిగ్గు లేదాఒక్క మద్యపాన నిషేధం చూస్తే.
మీ మోసం అర్దం అవడం లేదా నాడు నేడు పేరుతో కొత్త తరహా దోపిడీ, ట్యాబ్ ల పేరుతో మరో దోపిడీ వీటి ప్రచార ఆర్భాటానికి మాత్రం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు అత్త సొమ్ము అల్లుడు దానం తరహాలో కేంద్రం ఇచ్చిన నిధులకు మీ స్టిక్కర్లు వేసి ప్రచారం చేసుకున్నారు జగన్ పాలన చూస్తుంటే.పులి, బాటసారి కథ అందరికీ గుర్తు వస్తుందిఆనాడు ఆ పులి బాటసారి రక్తాన్ని తాగినట్లు.
నేడు జగన్ ప్రజల రక్తాని పిండుతున్నాడుప్రతి జిల్లాలో జగన్ పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చారువీటిలో ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పేందుకు దమ్ముంటే జిల్లాల వారీగా చర్చకు రండి కేంద్రం ఏ జిల్లాకు ఎంత ఇచ్చిందో మేం చెబుతాం.వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఖర్చు చేసిందో మీరు చెప్పగలరా మోడీ చేసిన అభివృద్ది మేం చూపిస్తాం.
మీరు మాత్రం మాయ మాటలతో మోసం చేయడానికి మళ్లీ సిద్దమా అంటున్నారుప్రజలు మాత్రం ఇప్పటికే నిర్ణయించుకున్నారు.మిమ్మలను సాగనంపడానికి సిద్దంగా ఉన్నారునమ్మక ద్రోహం చేసిన జగన్ ను మళ్లీ నమ్మండి అంటే ప్రజలు పిచ్చోళ్లు కాదు జగన్ ఎన్నిసార్లు మాట ఇచ్చారో.
ఎన్నిసార్లు మాట తప్పారో ప్రజలకు తెలుసుమోసం చేసి అధికారంలోకి రావడానికి జగన్ కుట్రలు చేస్తున్నారుమీరు ఎన్ని మాయలు చేసినా.ప్రజలు మీకు బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారుమీరు చేస్తున్న అసత్య ప్రచారాలు, మాయలు మోసాలు, అవినీతిని బీజేపీ పక్షాన ప్రజలకు వివరిస్తాంఎపీ అభివృద్ది కాంక్షించే వారంతా జగన్ ను ఓడించి ఇంటికి పంపిం.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy