హైదరాబాద్ అబిడ్స్ లో కస్టమర్లపై హోటల్ వెయిటర్స్ దాడి..!!

హైదరాబాద్ అబిడ్స్ లోని ఓ హోటల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

న్యూ ఇయర్ వేళ అబిడ్స్ పోస్టాఫీస్ దగ్గర ఉన్న హోటల్ లో బిర్యానీ విషయంలో ఘర్షణ చెలరేగింది.

వివాదం నేపథ్యంలో కస్టమర్లపై హోటల్ లోని వెయిటర్లు కర్రలతో దాడులకు పాల్పడ్డారని తెలుస్తోంది.ఫుడ్ ఆర్డర్ డెలివరీ విషయంలో ఆలస్యం కావడంతో కస్టమర్ల హోటల్ వెయిటర్లతో వాగ్వివాదానికి దిగారు.

దీంతో కస్టమర్లపై వెయిటర్లు కర్రలతో విరుచుకుపడ్డారు.అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే హోటల్ లో పని చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారని సమాచారం.

Advertisement
కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ మృతి

తాజా వార్తలు