హాట్ బ్యూటీకి జిఎస్టీ ఎఫెక్ట్... ఇంటిపై దాడి

టాలీవుడ్ లో ఆదాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ లావణ్య త్రిపాఠి.

ఈ సినిమాతో తన నటనతో ఆకట్టుకోవడంతో తెలుగులో వరుస అవకాశాలు ఈ అమండు సొంత అయ్యాయి.

ఎక్కువగా కుర్ర హీరోలకి జోడీగా నటించిన ఈ భామ కెరియర్ లో ఈ మధ్య కాస్తా స్పీడ్ తగ్గిందని చెప్పాలి.ఇక తాజాగా అర్జున్ సురవరం సినిమాలో నిఖిల్ కి జోడీగా నటించింది.

వరుస ఫ్లాప్ ల తర్వాత ఈ సినిమాతో అమ్మడి ఖాతారో మరో హిట్ పడింది.ఇదిలా ఉంటే తాజాగా లావాన్య త్రిపాఠి ఇంటిపై జీఎస్టీ అధికారులు దాడి చేశారు.

జీఎస్టీ అధికారుల దాడి చేశారంటేనే విషయం ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనంగా మారింది.సంపాదిస్తున్న డబ్బుకి ఎప్పటికప్పుడు జీఎస్టీని చెల్లిస్తూ ఉండాలి.

Advertisement

ఆమె తీసుకునే రెమ్యూనరేషన్ చాల తక్కువ కానీ లావణ్య త్రిపాఠి ఇంటిపై ఈరోజు అధికారులు దాడి చేసి లెక్కల గురించి వివరాలు సేకరించినట్లు సమాచారం.అయితే జీఎస్టీ అధికారులు ఆమె ఇంటిపై దాడి చేసే సమయంలో ఆమె షూటింగ్ లో ఉంది.

ఈ విషయం తెలియగానే షూటింగ్ రద్దు చేసుకొని ఇంటికొచ్చేసింది.అయితే జీఎస్టీ అధికారులు లావణ్య త్రిపాఠి ఇంటితో పాటు సిటీలో మరో 23 మంది ప్రముఖుల ఇల్లాల్లో కూడా దాడులు చేసి లెక్కలు చూసినట్లు తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు