Hero Tharun: స్విట్జర్లాండ్ లో పోలీసుల చేతిలో తరుణ్ ఎలా బుక్ అయ్యాడో తెలుసా ?

హీరో తరుణ్. రొమాంటిక్ హీరో గా తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయినా నటుడు.

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పేటి నువ్వే కావలి సినిమాతో తొలిసారి హీరో అవతారం ఎత్తిన తరుణ్ ఆ తర్వాత కొన్ని తప్పటడుగులు వేయడం తో ప్రస్తుతం కెరీర్ పోగొట్టుకొని ఇండస్ట్రీ నుంచి మాయం అయ్యాడు.అలాంటి స్టార్ హీరోయిన్ రోజా రమణి కుమారుడు అయిన తరుణ్ కి ప్రస్తుతం 42 ఏళ్ళు.2014 వరకు వరస సినిమాల్లో నటించిన తరుణ్ 2018 లో ఇది నా లవ్ స్టోరీ అనే సినిమాలో చివరి సారిగా కనిపించాడు.ఇక సెకండ్ ఇన్నింగ్స్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న అతడి కెరీర్ మాత్రం ముందుకు కదలడం లేదు.

తరుణ్ మాములుగా చాల సౌమ్యుడు అనే పేరు ఉన్నవాడు.ఒక్క ఆర్తి అగర్వాల్ తో ప్రేమ వ్యవహారం మినహా పెద్ద గా కాంట్రవర్సీలు లేవు.

కానీ ఎంతో పెద్ద స్టార్ హీరో అవుతాడు అనుకున్న కూడా ఎందుకో అతడు హిట్స్ అందుకోలేకపోయారు.నువ్వే కావలి సినిమా చాల పెద్ద హిట్ అయ్యాక అతడు స్క్రిప్ట్స్ ఎంపికలో పొరపాట్ల కారణంగా ఫ్లాప్ సినిమాలను ఎంచుకొని తప్పు చేసినట్టుగా ఇండస్ట్రీ బావిస్తోంది.

Advertisement

ఇక తరుణ్ సినిమాలు పెద్దగా లేకపోవడం తో స్విట్జర్లాండ్ లో ఉన్న తన ఇంట్లోనే ఎక్కువగా ఉంటున్నాడు.సమ్మర్ హాలిడేస్ లో కుటుంబం మొత్తం కూడా అక్కడే ఉంటారు.

అయితే బయట ప్రపంచానికి తెలియని విషయం ఏంటి అంటే తరుణ్ మహా భక్తుడు.బాగా పూజలు చేస్తాడు.అది మాములుగా కూడా కాదు.

అతడు పూజ చేసాడంటే ఇంట్లో అగరత్తుల పొగాకు మనుషులు కూడా కనిపించారట.ప్రతి మంగళవారం నిష్టగా ఉపవాసం ఉంటాడట.

అసలు ఆ రోజు పచ్చి మంచి నీళ్లు కూడా తాగాడట.అయితే ఒక రోజు స్విట్జర్లాండ్ లో తన గదిలో ఎక్కువ సంఖ్యలో అగరుబత్తులను వెలిగించడం తో పొగ మొత్తం రూమ్ నిండా నిండిపోయి ఫైర్ అలారం మోగి అక్కడికి పోలీసులు వచ్చారట.

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!

దాంతో అసలు విషయం చెప్పి వారిని తిప్పి పంపించే లోపు తరుణ్ కి తల ప్రాణం తోకకు వచ్చిందట.ఇలా తన భక్తి తో ఇంట్లో వాళ్ళను బాగా విసిగిస్తాడని రోజా రమణి ఒక ఇంటర్వ్యూ లో తెలపడం విశేషం.

Advertisement

తాజా వార్తలు