మళ్ళీ వాయిదా పడిన 'గుంటూరు కారం'.. ఈ నెల లేనట్టేనట!

సూపర్ స్టార్ మహేష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్( Mahesh Babu - Trivikram ) కలిసి ఏ ముహూర్తాన వారి న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసారో తెలియదు కానీ ఎప్పుడు ఏదో ఒక కారణంతో వాయిదా పడుతూనే ఉంది.

మహేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ క్రేజీ మాస్ మసాలా మూవీ గుంటూరు కారం( Guntur Karam ).

ఈ కమర్షియల్ సినిమాకు ముందు నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఎట్టకేలకు అన్ని సెట్ చేసుకుని జనవరిలో స్టార్ట్ అయ్యింది అనుకుంటే పట్టుమని రెండు షెడ్యూల్స్ చేసారో లేదో మళ్ళీ మూడు నెలలుగా వాయిదా లోనే ఉంది.మరి గత కొన్ని రోజులుగా వాయిదాలో ఉన్న ఈ సినిమాను ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు నిరాశ తప్పడం లేదు.ప్రకాష్ రాజ్( Prakash Raj ) డేట్స్ కారణంగా మొన్నటి వరకు వాయిదా పడుతూ వస్తుంది అని టాక్ వచ్చింది.

ఇక ఇప్పుడు ప్రకాష్ రాజ్ డేట్స్ దొరికాయి అని 22 నుండి షూట్ స్టార్ట్ అవుతుంది అని మళ్ళీ వార్తలు వచ్చాయి.కానీ తాజా సమాచారం వరకు మరి కొందరి నటుల కాల్ షీట్స్ సమస్య తీరలేదని అందుకే ఈసారి ఏకంగా జులై ఫస్ట్ వీక్ వరకు వాయిదా పడింది అని అంటున్నారు.దీంతో ఈ నెల మొత్తం షూట్ లేకుండానే త్రివిక్రమ్, మహేష్ వేస్ట్ చేసేసారు.

Advertisement

చూడాలి అన్ని సమస్యలు తీరి ఈ సినిమా ఎప్పుడు షూట్ స్టార్ట్ అవుతుందో.కాగా ఈ సినిమాలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే, శ్రీలీల( Sreeleela ) హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.

Advertisement

తాజా వార్తలు