ఏపీలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష..!

ఏపీలో గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష కొనసాగుతోంది.ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 301 కేంద్రాల్లో గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షను అధికారులు నిర్వహిస్తున్నారు.

రెండు పేపర్లుగా గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష ఉండగా పేపర్ -1 పరీక్షను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తున్నారు.అలాగే పేపర్ -2 పరీక్షను మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు.మధ్యాహ్నం 1.45 గంటల వరకు అభ్యర్థులను లోపలికి అనుమతించనున్నారు.కాగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 48 వేల 806 మంది అభ్యర్థులు పరీక్షను రాస్తున్నారని తెలుస్తోంది.

పోలీసులకు ఫిర్యాదు వల్ల రాజ్ తరుణ్ కెరీర్ కు ఇబ్బందేనా.. కొత్త ఆఫర్లు సులువు కాదంటూ?

తాజా వార్తలు