ట్రైన్ రెస్టారెంట్‌'కు క్యూ కడుతున్న భోజన ప్రియులు

సాధారణంగా సుదూర ప్రాంతాలకు ట్రైన్‌లో వెళ్లడాన్ని చిన్న పిల్లలు బాగా ఇష్టపడుతుంటారు.కిటికీలో నుంచి కనిపించే అందమైన దృశ్యాలను చూస్తూ కేరింతలు కొడతారు.

ప్రయాణం ముందుగానే ఉందని తెలుసుకునే వారు బయల్దేరే ముందే పులిహోర, పెరుగన్నం వంటివి ప్యాక్ చేసుకుంటారు.కుటుంబం అంతా చక్కగా ట్రైన్‌లో కొసరి కొసరి వడ్డించుకుని తింటారు.

ఇదే తరహా వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఓ రెస్టారెంట్‌కు రూపకల్పన జరిగింది.మనం ఆర్డర్ చేస్తే చాలు.

మనం కూర్చున్న టేబుల్ వద్దకు కోరుకున్న ఆహారం బుల్లి ట్రైన్ తీసుకొచ్చేస్తుంది.ఇక ఎంతో రుచికరంగా ఉండే ఆహార పదార్థాలను తిని, ఆ ట్రైన్ రెస్టారెంట్‌కు అంతా మరలా మరలా వెళ్తున్నారు.

Advertisement

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో రైలు థీమ్‌పై ఆధారపడిన రెస్టారెంట్ వేగంగా ప్రజాదరణ పొందుతోంది.జర్మనీలో తయారు చేయబడిన చిన్న లోకోమోటివ్ రైలు మోడల్‌ను కలిగి ఉంది.

ఇది రెస్టారెంట్‌లోని ట్రాక్‌లపై నేరుగా నడుస్తున్న టేబుల్‌లకు ఆహారాన్ని అందిస్తుంది.వినూత్న రైలు మోడల్‌తో పాటు, రెస్టారెంట్ రుచికరమైన చైనీస్, సౌత్-నార్త్ ఇండియన్ రకాల వంటకాలకు కూడా ప్రసిద్ధి చెందింది.

ముగ్గురు ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు కె.సర్వేశ్వర్ రావు, వి.వినోద్, కె.మధు చిన్నప్పటి నుండి రైలు ప్రయాణం గుర్తు తెచ్చుకున్నారు.అదే తరహా వాతావరణం ఉండేలా చక్కటి రెస్టారెంట్‌కు రూపకల్పన చేశారు.

వారు కాన్సెప్ట్ రెస్టారెంట్‌కు ప్లాట్‌ఫాం65 అని పేరు పెట్టారు.రెండేళ్ల క్రితం ప్రారంభించిన ఈ రెస్టారెంట్‌కు భోజన ప్రియులు క్యూ కడుతున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 8, బుధవారం 2023

తమకు 198 మంది కూర్చుని తినేలా, సీటింగ్ కెపాసిటీ ఉందని నిర్వాహకులు చెబుతున్నారు.వారం అంతటా తమ రెస్టారెంట్ రద్దీగా ఉంటుందని, ఇక శని, ఆదివారాల్లో అస్సలు ఖాళీ ఉండదని పేర్కొంటున్నారు.

Advertisement

బిర్యానీ నుంచి తీపి పదార్థాల వరకు, వెజ్-నాన్‌వెజ్ పదార్థాలన్నీ ఇక్కడ లభిస్తాయి.

ఈ రెస్టారెంట్‌లోని టేబుళ్లను జైపూర్, విజయవాడ, కాన్పూర్, త్రివేండ్రం తదితర పేర్లతో పిలుస్తారు.ఇలా మొత్తం 10 స్టేషన్లు ఉంటాయి.ఒక్కో స్టేషన్‌ను 3 భాగాలుగా విభజించారు.

అలాగే జైపూర్ జే1, జే2, జే3గా పిలుస్తుంటారు.జైపూర్ టేబుల్ టూపై ఆర్డర్ చేసినప్పుడు, జే2 బటన్‌ను నిర్వాహకులు ఎంచుకుంటారు.ఆహారం పెట్టి, ఇంజిన్‌ను టేబుల్‌కి వదిలివేస్తారు.

అది నేరుగా వచ్చి జైపూర్ స్టేషన్ టేబుల్ వద్ద కూర్చున్న కస్టమర్ల వద్దకు చేరుకుంటుంది.కస్టమర్లు ఆయా ఆహార పదార్థాలను వడ్డించుకుని చక్కగా ఆస్వాదిస్తూ తింటారు.

పిల్లలతో పాటు పెద్దలనూ ఇది విశేషంగా ఆకర్షిస్తోంది.

తాజా వార్తలు