చార్ ధామ్ యాత్రలో పెల్లుబికిన భక్తుల ప్రవాహం..లక్షలకు పైగా భక్తులు..?

హిందువులు చార్ ధామ్ యాత్రను( Char Dham Yatra ) చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు.

తమ జీవితంలో ఒక్కసారి అయినా చార్ ధామ్ యాత్రను చేయాలని అనుకుంటారు.

ఈ విధంగా ప్రతి సంవత్సరం చార్ ధామ్ యాత్రకు భక్తులు తరలి వస్తూ ఉంటారు.చార్ ధామ్ అంటే కేదార్ నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి లను చుట్టి రావడమే.

ఈ చార్ ధామ్ యాత్రతో పాటు ఇతర ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు కూడా ఈ సంవత్సరంలో భక్తుల తాకిడి ఎదురయింది.

అయితే ఈ సంవత్సరంలో ఏ ధామాన్ని సందర్శించడానికి ఎంత మంది భక్తులు వచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం.మీడియా సమాచారం ప్రకారం ఈ సంవత్సరం దాదాపు 50 లక్షల మందికి పైగా భక్తులు చార్ ధామ్ యాత్ర చేయడానికి వచ్చారు.2021 లో సుమారు 5 లక్షల 18 వేల మంది భక్తులు ఈ యాత్ర కోసం వచ్చారు.ఇక 2022లో ఈ సంఖ్య 46 లక్షల 27 వేలకు దాటింది.

Advertisement

ఇక ఈ సంవత్సరం అక్టోబర్ 16 నాటికి ఈ సంఖ్య 50 లక్షలు దాటడం విశేషం అని చెప్పవచ్చు.అలాగే ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ధామ్ 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా పరిగణిస్తారు.

ఇక ప్రతి సంవత్సరం ఇక్కడ భక్తులు రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది.ఇక్కడికి చేరుకోవడానికి హెలికాప్టర్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.

ఇక ఈ సంవత్సరం 19 లక్షల 61 వేల మందికి పై భక్తులు కేదార్నాథ్ తీర్థయాత్ర ( Kedarnath )చేశారు.ఈ సంవత్సరంలో కేదార్నాథ్ తలుపులు ఏప్రిల్ 25న తెరుచుకున్నాయి.

అలాగే యాత్ర నవంబర్ 15న ముగిసింది.విష్ణు భక్తులు బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించడాన్ని ఒక వరంగా భావిస్తారు.

ఆ నటుడు నన్ను చూపుతోనే భయపెట్టాడు.. రజనీకాంత్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్6, ఆదివారం 2024

ఈ సంవత్సరం బద్రీనాథ్ యాత్ర ఏప్రిల్ 27న ప్రారంభమై, నవంబర్ 15న ముగిసింది.ఇక ఈ సంవత్సరం బద్రీనాథ్ కి వచ్చిన భక్తుల సంఖ్య 18 లక్షల 34 వేల మంది.

Advertisement

ఈ ఏడాది తొమ్మిది లక్షల 5 వేల మందికి పైగా భక్తులు గంగోత్రి యాత్రను కూడా పూర్తి చేసుకున్నారు.

ఈ సంవత్సరంలో గంగోత్రి యాత్ర( Gangotri Yatra ) ఏప్రిల్ 22 నుండి ప్రారంభమై నవంబర్ 14న ముగిసింది.ఇక ప్రతి సంవత్సరం గంగోత్రి యాత్ర ప్రారంభం అవ్వగానే గంగమ్మ దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు అక్కడికి తరలి వచ్చారు.

తాజా వార్తలు