Jithender Reddy : ప్రస్తుతానికి బీజేపీలో ఉన్నా..: మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి

బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో( Former MP Jithender Reddy ) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) భేటీ అయిన సంగతి తెలిసిందే.

ఈ భేటీపై జితేందర్ రెడ్డి స్పందించారు.

సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగానే తనను కలిశారని చెప్పారు.పరామర్శకు మాత్రమే రేవంత్ రెడ్డి తన నివాసానికి వచ్చారని తెలిపారు.

మల్కాజ్ గిరి సీటు( Malkajgiri Seat ) వ్యవహారంపై ఎటువంటి చర్చలు జరగలేదని పేర్కొన్నారు.

తనకు మహబూబ్ నగర్ సీటు రాలేదని రేవంత్ రెడ్డి కూడా బాధపడ్డారన్నారు.మహబూబ్ నగర్ సీటు తనకే వస్తుందన్న నమ్మకంతోనే ఉన్నానన్న జితేందర్ రెడ్డి కాంగ్రెస్ సీట్లు ఇప్పటికే ఖరారు చేసుకున్నారని వెల్లడించారు.ప్రస్తుతానికి బీజేపీలోనే( BJP ) ఉన్నానని స్పష్టం చేశారు.

Advertisement
మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

తాజా వార్తలు