కమళం కండువా కప్పుకోవడానికి ముహూర్తం ఖరారు చేసుకున్న ఈటల.. ఎప్పుడంటే.. ?

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఒక కుదుపు కుదిపిన ఈటల రాజేందర్ వ్యవహారాం మొత్తానికి ఒక కొలిక్కి వచ్చిందని ప్రచారం జరుగుతుంది.

ఊహించని పరిణామాల మధ్య టీఆర్ఎస్‌ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన ఏ పార్టీలో చేరుతారా అనే ఆసక్తి తెలంగాణ ప్రజలతో పాటుగా, రాజకీయ నేతల్లో నెలకొన్న విషయం తెలిసిందే.

అయితే ఈటలను తమ పార్టీలో చేర్చుకోవడానికి కొన ఊపిరితో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదట.ఈ క్రమంలో తెలంగాణాలో గులాభి సైన్యాన్ని ఎదుర్కోవడానికి ఆయనకు బలం కావాలి అందుకే కమళం వైపు చూపు సారించిన ఈటల బీజేపీ అండదండలతో తన పొలిటికల్ మైలేజీ పెంచుకోవడానికి బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారట.

ఈ క్రమంలో ఈ నెల 14వ తేదీన బీజేపీలో చేరడానికి ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం.కాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల కాషాయ కండువా కప్పుకోనున్నారట.

ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను.. సోనమ్ కపూర్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

Advertisement

తాజా వార్తలు