నిద్రపోయేటప్పుడు ప్రతి మనిషి కలలు కనడం సాధారణమైన విషయమే.
కలలు మన భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను శుభాలను, ఆ శుభాలకు సంకేతాలుగా తెలియజేస్తాయని చెబుతూ ఉంటారు.
కలలో జరిగే సంఘటనల ప్రాముఖ్యత వాటి సంకేతాల గురించి వివరంగా చెప్తారు.కొన్ని కలలు మనకు చెడు సంకేతాలను ఇస్తూ ఉంటాయి.
కొన్ని కలలు జీవితంలో జరిగే మంచి విషయాలు గురించి చెబుతూ ఉంటాయి.ఇటువంటి పరిస్థితులలో తీర్థయాత్ర, దేవుడి దర్శనం లేదా దేవాలయానికి వెళ్ళినట్టు కలలో కనిపిస్తే అది ఎంతో శుభం అని వేద పండితులు చెబుతున్నారు.
కాబట్టి ఈ కలలా ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఒక వ్యక్తికి కలలో తీర్థ యాత్రకు వెళ్లినట్లు కనిపిస్తే ఈ కల ఎంతో శుభప్రదం అని వేద పండితులు చెబుతున్నారు.
మీపై భగవంతుని అనుగ్రహాన్ని సూచించే అవకాశం ఉంది.తీర్థయాత్రల సమయంలో ఎ దేవుణ్ణి ప్రదేశాన్ని చూస్తారో ఆ దేవున్ని ఆశీస్సులు మీపై ఉన్నాయని చెబుతూ ఉంటారు.
రాబోయే రోజుల్లో మీరు కొన్ని శుభవార్తలు కూడా వినే అవకాశం ఉంది.మీ పురోగతికి మార్గం ఉంటుంది.
కలలో నిశ్శబ్ద దేవాలయాన్ని చూడడం ఎంతో శుభంగా భావిస్తారు.కలశాస్త్రం ప్రకారం మీ కలలో ప్రశాంతమైన ఆలయం కనిపిస్తే మీ జీవితంలో కలత చెందుతారని మీకు శాంతి అవసరం అని అర్థం చేసుకోవాలి.అలాంటి కల మీ జీవితంలోని కష్టాలు దూరమవుతున్నాయని, ఆనందాన్ని పొందబోతున్నారని అర్థం చేసుకోవచ్చు.
కలశాస్త్రం ప్రకారం గణపతి విగ్రహంతో పాటు తెల్లటి దేవాలయం కనిపిస్తే మీరు వినాయకుని అనుగ్రహం పొందుతున్నారని అర్థం చేసుకోవచ్చు.తెల్లని దేవాలయం కలలో కనిపించడం ఎంతో శుభం అని చెబుతూ ఉంటారు.
భవిష్యత్తులో ఆర్థిక ప్రయోజనాలను పొందడానికి ఇది సంకేతం అని చెప్పవచ్చు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy