తెలంగాణ కాంగ్రెస్‎లో మళ్లీ అసంతృప్తరాగం..!

తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి అంసతృప్త రాగం వినిపిస్తోంది.నిరుద్యోగ నిరసన దీక్షల సమాచారం విషయంలో నేతల మధ్య విభేదాలు బయటకు వస్తున్నాయి.

ఈనెల 21న నల్గొండ జిల్లా మహాత్మాగాంధీ యూనివర్సిటీలో నిరసన దీక్ష నిర్వహించనున్నారు కాంగ్రెస్ నేతలు.అయితే ఈ దీక్షకు సంబంధించిన తనకు సమాచారం లేదని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు.

ఈ క్రమంలోనే పీసీసీ నేతలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.మరోవైపు సీఎల్పీ నేత భట్టి తెలంగాణ కాంగ్రెస్ లో ఎటువంటి విభేదాలు లేవని తెలిపారు.

నాగార్జునతో ప్రతి ఒక్కరు ప్రేమలో పడతారు.. కుష్బూ సంచలన వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు