కేసీఆర్ పాలనలో అభివృద్ధి పాతాళానికి వెళ్లింది.. రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలనతో అవినీతి ఆకాశానికి చేరిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.అభివృద్ధి పాతాళానికి వెళ్లిందని విమర్శించారు.

కాంగ్రెస్ తెలంగాణ ఎన్నికల వ్యూహా కమిటీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మాట్లాడారు.బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా సమావేశంలో చర్చించామని తెలిపారు.120 రోజుల్లో ఎన్నికలకు ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై విస్తృతంగా చర్చించినట్లు వెల్లడించారు.రాష్ట్రంలో బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు కేంద్రంలో మోదీ సర్కార్ వైఫల్యాలపై కూడా చర్చించినట్లు తెలిపారు.

కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ మృతి

తాజా వార్తలు