ఇది కదా టూరిజం అంటే.. డానిష్ టూరిస్టులను చేసిన పనికి నెటిజన్లు ఫిదా!

ఇటీవల సిక్కిం( Sikkim ) అందాల్ని చూడ్డానికి వెళ్లిన డానిష్ టూరిస్టులు( Danish Tourists ) ఓ మంచి పని చేశారు.

ఆ పని గురించి తెలిసి ఇప్పుడు అందరూ ఫిదా అయిపోతున్నారు.

వాళ్లేం చేశారంటే యూమ్‌థాంగ్ వ్యాలీకి వెళ్లే దారిలో రోడ్డు పక్కన పడి ఉన్న చెత్తనంతా ఏరి పారేశారు.వాళ్ల మంచి మనసుకి తోటి టూరిస్టులే కాదు, అక్కడి లోకల్స్ కూడా జేజేలు కొడుతున్నారు.

వాళ్లు అలా చెత్త ఏరుతున్న వీడియోని ఎవరో ఇన్‌స్టాలో పెట్టేసరికి అది కాస్తా వైరల్( Viral Video ) అయిపోయింది."డెన్మార్క్( Denmark ) నుంచి వచ్చిన టూరిస్టులు యూమ్‌థాంగ్ వ్యాలీ వెళ్తూ దారిలో చెత్త ఏరుతున్నారు.

వాళ్ల మంచి పనికి అందరూ షాక్ అయ్యారు, మెచ్చుకోకుండా ఉండలేకపోయారు" అని క్యాప్షన్ కూడా పెట్టారు.ఆ వీడియో చూసిన వాళ్లంతా స్ఫూర్తి పొందుతున్నారు.

Advertisement

చిన్న పనైనా ప్రకృతిని కాపాడటంలో ఎంత పెద్ద తేడా చూపిస్తుందో అని కామెంట్స్ పెడుతున్నారు.చాలా మంది సోషల్ మీడియా యూజర్స్ ఆ డానిష్ టూరిస్టులకి దండం పెట్టేస్తున్నారు.

కానీ, కొంతమంది భారతీయులు మాత్రం మనవాళ్లకి ఇంకా సివిక్ సెన్స్ రాలేదని తెగ బాధపడిపోతున్నారు.

ఒక నెటిజన్ ఏమన్నాడంటే, "వాళ్లని చూసి మనం నేర్చుకోవాలి.మనమంతా ఇలాగే చేస్తే మన దేశం టూరిజంలో నంబర్ వన్ అయిపోతుంది" అని అన్నాడు.ఇంకొకరేమో "చెత్త వేసేవాళ్లకి సిగ్గుండాలి.

టూరిస్టులు ఎంత మంచి ఎగ్జాంపుల్ సెట్ చేశారో చూడండి.వాళ్లకి హాట్సాఫ్" అని కామెంట్ పెట్టారు.

How Modern Technology Shapes The IGaming Experience
న్యూస్ రౌండప్ టాప్ 20

"యూమ్‌థాంగ్‌లో ఈ అమ్మాయిని కలిశాను.మీ దేశం చాలా బాగుంది, దాన్ని శుభ్రంగా ఉంచుకోండి అని చెప్పింది.

Advertisement

ఎంత మంచి మనిషో" అని ఇంకొక యూజర్ తన అనుభవం పంచుకున్నాడు.మరొకాయన "మన ప్లేస్‌లను శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనదే.

వాళ్లని చూసైనా బుద్ధి తెచ్చుకోండి" అని హితవు పలికారు.

ఇలాగే, అకీ డోయ్ అనే 38 ఏళ్ల జపనీస్ అమ్మాయి 2022 నుంచి పూరీ బీచ్‌ని శుభ్రం చేస్తోంది.మొదటిసారి ఆ బీచ్‌కి వెళ్లినప్పుడు దాని అందానికి ఫిదా అయిపోయిందట.అప్పటినుంచి దాన్ని కాపాడటం తన బాధ్యతగా ఫీలయ్యింది.

అప్పటినుంచి రోజూ చెత్త ఏరుతూ బీచ్‌ని మళ్లీ తన అందంతో మెరిసేలా చేస్తోంది.ఎక్కడున్నా ప్రకృతిని గౌరవించడం, కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఇలాంటి వాళ్లని చూస్తే అర్థమవుతుంది.

తాజా వార్తలు