మునుగోడు బైపోల్ కౌంటింగ్‎కు కౌంట్‎డౌన్

మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్‎కు కౌంట్‎డౌన్ కొనసాగుతోంది.రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది.

రేపు మధ్యాహ్ననికి మునుగోడు ఉపఎన్నిక ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో కౌంటింగ్ కు ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.

నల్గొండలోని తెలంగాణ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాముల్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది.కౌంటింగ్ కోసం మొత్తం 21 టేబుళ్ల ఏర్పాటు చేసిన అధికారులు 15 రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు.

మొదట బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుందని అధికారులు తెలిపారు.

Advertisement
అమెరికా అధ్యక్ష ఎన్నికలు : కమల, ట్రంప్‌లలో గెలుపెవరిది.. యూఎస్ నోస్ట్రాడమస్ ఏం చెప్పారంటే?

తాజా వార్తలు