Steel plant in Visakhapatnam : ఈ నెల 16న స్టీల్‎ప్లాంట్‎లో కాంగ్రెస్ బహిరంగ సభ..!

విశాఖపట్నంలోని స్టీల్‎ప్లాంట్‎లో( steel plant in Visakhapatnam) ఈ నెల 16వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభ జరగనుంది.

ఈ సభకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy )హాజరు అవుతారని కాంగ్రెస్ నేత గిడుగు రుద్రరాజు తెలిపారు.

విశాఖ స్టీల్‎ప్లాంట్‎ ప్రైవేటీకరణను కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందన్నారు.అదేవిధంగా త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో త్వరలోనే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలో చాలా మంది నాయకులు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని చెప్పారు.ఈ క్రమంలోనే వివేకానంద రెడ్డి కుటుంబం కాంగ్రెస్ లోకి వస్తామంటే స్వాగతిస్తామని తెలిపారు.

మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు
Advertisement

తాజా వార్తలు