కాంగ్రెస్ అంటే నాటకం..: మంత్రి హరీశ్ రావు

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ అంటే నమ్మకం, కాంగ్రెస్ అంటే నాటకమని పేర్కొన్నారు.

ఒక్క ఛాన్స్ కాదు పదకొండు సార్లు గెలిచిన కాంగ్రెస్ ఏం చేసిందని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.ఇప్పుడు ఏజెన్సీలో విష జ్వరాలు, అంటు రోగాలు లేవని చెప్పారు.

బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కరెంట్ కోతలు ఉన్నాయన్నారు.తెలంగాణలో 24 గంటల నిరంతర కరెంట్ ఇస్తున్నామని తెలిపారు.

బీజేపీకి ఓటేస్తే బోర్ల దగ్గర మీటర్లు వస్తాయన్న మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ కు ఓటేస్తే మూడు గంటలే కరెంట్ వస్తుందన్నారు.రైతుబంధు సృష్టికర్త కేసీఆర్ అని తెలిపారు.ఎకరాకు రూ.10 వేలు ఇచ్చామన్న ఆయన రూ.16 వేలకు పెంచబోతున్నామని వెల్లడించారు.

Advertisement
నిరుపేద కుటుంబానికి తన వంతు సహాయం చేసిన పల్లవి ప్రశాంత్.. ఏం చేశారంటే?

తాజా వార్తలు