Sajjala Ramakrishna Reddy : ప్రొద్దుటూరులో సీఎం జగన్ తొలి సభ..: సజ్జల

ఏపీలో సీఎం జగన్( CM Jagan ) నిర్వహించనున్న బస్సు యాత్ర షెడ్యూల్ ను వైసీపీ ప్రకటించింది.

ఈ మేరకు ఈ నెల 27వ తేదీ నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) తెలిపారు.

వైఎస్ఆర్ జిల్లాలోని ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభంకానుందన్న సజ్జల ప్రొద్దుటూరులో సీఎం జగన్ తొలి సభ ఉంటుందని పేర్కొన్నారు.

మేమంతా సిద్ధం( Memantha Siddham )’ పేరుతో బస్సు యాత్ర జరగనుందన్నారు.ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలను సన్నద్ధం చేసేందుకే బస్సు యాత్రను నిర్వహిస్తున్నామని తెలిపారు.సిద్ధం సభలు జరిగిన నియోజకవర్గాలు మినహా మిగిలిన చోట్ల జగన్ బస్సు యాత్ర ఉంటుందని వెల్లడించారు.

యాత్రలో భాగంగా ఉదయం పూట కార్యకర్తలతో సీఎం జగన్ ఇంటరాక్షన్ అవుతారని చెప్పారు.గతంలో ఎన్నడూ లేని విధంగా సభలు జరుగుతాయని తెలిపారు.

Advertisement
మనుషులను అంచనా వేయడంలోనూ వేణుస్వామి తోపు.. బిగ్‌బాస్ నెక్స్ట్ సీజన్ గెలిచేస్తారా..? 

తాజా వార్తలు