సీఎం జగన్ సంఘ సంస్కర్త..: ఎంపీ ఆర్.కృష్ణయ్య

ఏపీలోని ప్రతిపక్షాలపై ఎంపీ ఆర్.కృష్ణయ్య తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

బీసీలను ప్రలోభాలకు గురి చేయాలని విపక్షాలు చూస్తున్నాయని ఆరోపించారు.

సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలోని బీసీలు అందరూ ఆనందంగా ఉన్నారని ఎంపీ ఆర్.కృష్ణయ్య తెలిపారు.జగన్ రాజకీయ నాయకుడు కాదన్న ఆయన జగన్ ఓ సంఘ సంస్కర్త అని కొనియాడారు.

ఈ క్రమంలోనే అడగకుండానే సీఎం జగన్ వరాలు ఇస్తున్నారని పేర్కొన్నారు.బీసీ, ఎస్టీ, ఎస్సీలంతా కలిసి మళ్లీ సీఎంగా జగన్ ను గెలిపించుకోవాలని తెలిపారు.

వైసీపీకి 150కి పైగా సీట్లు వస్తాయని తన సర్వేలో తెలిసిందని వెల్లడించారు.

Advertisement
My Empire : Reseña Y Reputación Del Sitio Para Jugadores E...