మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ పరిశీలనకు చీఫ్ ఇంజనీరింగ్ బృందం..!!

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని( Medigadda Lakshmi Barrage ) చీఫ్ ఇంజనీరింగ్ బృందం పరిశీలించింది.

నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశాల మేరకు ఆరుగురు సభ్యుల టీమ్ సందర్శించింది.

ఈఎన్సీ అనిల్ కుమార్( ENC Anil Kumar ) నేతృత్వంలో ఈ బృందం ఏర్పాటైంది.ఇందులో భాగంగా బ్యారేజీపై కుంగిన వంతెనతో పాటు ఏడవ బ్లాక్ లోని దెబ్బతిన్న పియర్స్ ను చీఫ్ ఇంజనీరింగ్ బృందం( Chief Engineering Team ) పరిశీలించింది.

ఈ క్రమంలోనే కుంగుబాటుకు గల కారణాలను ఇంజనీర్లు అడిగి తెలుసుకున్నారు.తరువాత పియర్స్ ఫుటేజీలను సేకరించిన అధికారులు బొరియ ఏర్పడిన ప్రాంతం, కుంగిన పియర్స్, గేట్ల స్థితిగతులను పరిశీలించారు.

అదేవిధంగా 15 వ పియర్ నుంచి 21వ పియర్లు, గేట్ల వద్ద ఇసుక మేటలు సందర్శించిన ఇంజనీర్లు గేట్ల రిపేరు పనులను తెలుసుకున్నారు.

Advertisement
హే ప్రభూ.. ఏంటి ఈ విడ్డురం.. బస్సు అనుకుంటే పొరపాటే సుమీ..

తాజా వార్తలు