ఏపీలో భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశంః ఐఎండీ

బంగాళాఖాతంలో ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌న ద్రోణి కొన‌సాగుతోంది.రాగ‌ల 24 గంట‌ల్లో ప‌శ్చిమ మ‌ధ్య బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డే అవ‌కాశం ఉంది.

దీని ప్ర‌భావంతో రానున్న రెండు రోజుల‌పాటు రాష్ట్ర‌వ్యాప్తంగా పిడుగుల‌తో కూడిన వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ తెలిపింది.అదేవిధంగా కోస్తాంధ్ర‌లో అక్క‌డ‌క్క‌డ భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కుర‌వనున్నాయ‌ని స్ప‌ష్టం చేసింది.

ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, మ‌త్స్య‌కారులు వేట‌కు వెళ్లొద్ద‌ని సూచించింది.

Lorem Ipsum Dolor Sit Amet
Advertisement