మంచు వర్షంలో పెళ్లి కూతురు కోసం పెళ్లి కొడుకు

హిందూ వివాహ వ్యవస్థలో పెళ్లి అనే బంధానికి ముందు తోలిచూపులు ఉంటాయి.ఈ తొలిచూపులలో అమ్మాయిని చూడటానికి అబ్బాయి వెళ్తాడు.

ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకుంటారు.ఇక తరువాత పెద్దలు కూర్చొని పెళ్లి గురించి మాట్లాడుకుంటారు.

అయితే ఇలాంటివి ఒకప్పుడు ఉండేవి.ఇప్పుడు అంతా సోషల్ మీడియా యుగం అమ్మాయి, అబ్బాయి ఒకరిని ఒకరు చూసుకోవడం అనే కాన్సెప్ట్ పూర్తిగా మారిపోయింది.

అయితే ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ యువకుడి తనకు కాబోయే భార్య కోసం చేసిన పని సోషల్ మీడియా వైరల్ గా మారింది.హిమాలయ రాష్ట్రంలో గల చిమోలీ జిల్లా సమీపంలోని బిజ్రా అనే చిన్న పల్లెటూరు ఎత్తైన పర్వతాల మధ్య ఉంది.

Advertisement

ఈ గ్రామానికి వాహన సదుపాయం కూడా లేదు.ఆ గ్రామంలోని యువతిని వివాహం చేసుకోవడానికి రెడీ అయిన యువకుడు తొలిసారి చూడటానికి ఏకంగా నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్ళాడు.

నడిచి వెళ్ళడంతో వింతేముంది అనే భావించి ఉండొచ్చు.అయితే అతను ఎత్తయిన మంచుకొండల మధ్య విపరీతంగా మంచు కురుస్తూ ఉంటే ఆ హిమపాతంలోనే స్నేహితులతో కలిసి పెళ్లి కుమార్తె ఇంటికి వెళ్ళాడు.

ఇప్పుడు దీనికి సంబందించిన ఫోటోలు అతని మిత్రులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారాయి.సోషల్ మీడియాలో ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

Advertisement

తాజా వార్తలు